telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టూరిజం బోటు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

chandrababu

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో 61 మందితో ప్రయాణిస్తున్న ఓ టూరిజం బోటు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయింది.టన చోటుచేసుకుంది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురికావడం బాధాకరం అన్నారు. జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.

మరో వైపు ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ వెంటనే సంఘటన స్థలానికి పయనమయ్యారు. కాగా, సహాయ చర్యల కోసం రాజమండ్రి నుంచి హెలికాప్టర్ బయల్దేరింది.ఈ ఘటనలో 15 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరినట్టు భావిస్తున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటక బోటు ప్రయాణానికి అనుమతినిచ్చిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి.

Related posts