కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో పేదల సంతోషాన్ని పట్టించుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు పేదవారికి అందాలన్నారు. పేదల జీవనప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్ రెండేళ్లుగా నెంబర్ వన్గా ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి 670 అవార్డులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.
రైతుకు అండగా ఉండేందుకే ఏరువాక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతపురంలో అత్యల్ప వర్షపాతం ఉంటుందని పేర్కొన్నారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఆదాయం రావాలన్నారు. పొలం పిలుస్తోంది, బడికి పోదాం కార్యక్రమాలు చేపట్టమని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.