డిప్లొమా హోల్డర్లకు ఈ నెల 30న ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఈసెట్-2019) ఇంజనీరింగ్ కాలేజీల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం(లేటరల్ ఎంట్రీ) పొందేందుకు వీలుగా జరగనుంది. ఉదయం 10 గంట నుంచి 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని 49 సెంటర్లలో జరగనున్న ఈ పరీక్షకు 39,734 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 10% సీట్లను ఈసెట్ ర్యాంకర్లకు కేటాయిస్తారు.