ఏపీ సీఎం జగన్ ఇంగ్లీషులో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిభా విజేతలకు పురస్కారాలను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా వారు ఇంగ్లిషులో ఎలా మాట్లాడతారో మనం చూశామని, ‘బ్రీఫ్డ్ మీ’ అని గతంలో అన్నారని గుర్తు చేశారు.కమిషన్ కోసం రూ.వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అంజాద్ బాషా ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల బోధనను అందుబాటులోకి తీసుకురావడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. దీనిపై చాలా మంది విమర్శలు చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రోజునే అభివృద్ధి సాధ్యమని అన్నారు. తమ సర్కారు సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. మైనారిటీలకూ నాణ్యమైన విద్యను అందిస్తామని పేర్కొన్నారు.