telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

సెలవులో ద్వివేది.. ఇచ్చారా… పంపారా.. !

ap election officer altered

మొదటి విడతలోనే ఎన్నికలు జరుపుకున్న ఏపీలో పరిస్థితులు రోజుకోరకంగా మారుతున్న ఈ తరుణంలో .. ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళుతున్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ద్వివేది సెలవు పెట్టారు. ఆయన వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నట్టు సమాచారం. తిరిగి ఈ నెల 16న ద్వివేది విధులకు హాజరవుతారు.

ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ద్వివేది మాట్లాడతూ, స్క్రీనింగ్ కమిటీ నివేదించిన క్యాబినెట్ భేటీ అజెండాకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించవచ్చని అన్నారు. అనుమతి వచ్చేందుకు రెండ్రోజుల సమయం పడుతుందని, బహుశా సోమవారం దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. క్యాబినెట్ భేటీ జరిగేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని ద్వివేది అభిప్రాయపడ్డారు.

అయితే ద్వివేది ని పక్కకు తప్పించడానికి ఈ సెలవుపై పంపిస్తున్నారా.. లేక నిజంగా విశ్రాంతి కోసం సెలవులు ఇచ్చారా .. అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

Related posts