telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీ అభ్యర్ది రఘు నందన్ బావమరిది అరెస్ట్..

ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలే హాట్ టాపిక్. రాష్ట్రం మొత్తం అటువైపే చూస్తుంది. హవాలా చేస్తున్నకోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అలాగే ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ విషయం గురించి కమిషనర్ మాట్లాడుతూ… చందా నగర్ కు చెందిన వ్యక్తి దుబ్బాక బీజేపీ అభ్యర్ది రఘు నందన్ బావ మరిది అయిన సురభి శ్రీనివాస్ రావ్ అరెస్టు చేసాము. అలాగే మరో వ్యక్తి రవి కుమార్ కార్ డ్రైవర్ ను అరెస్ట్ చేసాము. వారివద్ద నుండి ఇన్నోవా కారు 2 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాం. ఫోన్ లో చాలా కీలక సమాచారం సేకరించాము. ఫోన్ కాల్ లిస్ట్ లో రఘు నందన్ రావు కి నేరుగా శ్రీనివాస్ రావు ఫోన్ చేశాడు. రఘు నందన్ రావు బావ మరిది శ్రీనివాస్ కు విశాఖ ఇండస్ట్రీ నుండి కోటి రూపాయలు హైదరాబాద్ మీదుగా దుబ్బాక వెళుతుంది. నిస్పక్ష పాతంగ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడు ధృడ నిశ్చయంతో వుంటారు అని కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. మరి ఏ విషయం పై బీజేపీ అభ్యర్ది రఘు నందన్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది చూడాలి.

Related posts