telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ సమస్యను త్వరగా పరిష్కరించాలి .. కేసీఆర్ కు డీఎస్ లేఖ…

మాజీ మంత్రి డి. శ్రీనివాస్ ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కార్మికుల పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందని, ఉద్యోగభద్రత పేరుతో మెడపై కత్తి పెట్టినా కార్మికులు తలవంచ లేదని, ఆర్టీసీ విభజన జరగకముందే ప్రైవేట్‌పరం చేయడం సరికాదని సూచించారు.

కేసీఆర్ తన స్వభావానికి విరుద్ధంగా ఇంత కఠినంగా వ్యవహరించడం చూస్తుంటే.. ఏదో కుట్ర ఉన్నట్టు అనుమానం కలుగుతోందని లేఖలో డీఎస్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు కారణమైనవారిపై గుండె రగులుతోందని, ఇకనైనా పంతాలకు పోకుండా కార్మికులతో చర్చలు జరపాలని డీఎస్‌ హితవుపలికారు.

Related posts