విశాఖ లో నానాటికి మాదకద్రవ్యాల సరఫరా పెరుగుతూనే ఉంది. సుందర సాగర తీరం లో యువత మత్తుకు చిత్తవుతున్నారు. పార్టీల పేరుతో లేట్ నైట్లు.. వీకెండ్ల పేరుతో లాంగ్ ట్రిప్సులు వేస్తూ తప్పుదోవ పడుతున్నారు. మూడు రోజుల క్రితం విశాఖలో జరిగిన ఓ పార్టీద్వారా ఈ మత్తు బాగోతం వెలుగు చూసింది.
కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. విశాఖ రుషికొండ సమీపంలో ఓ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 13న సోనీ అనే వ్యక్తి రుషికొండలో పార్టీ నిర్వహించాడు. అక్కడ డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వెళ్లి తనిఖీలు చేసినా.. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పోలీసుల కన్నుకప్పి దాచిన డ్రగ్స్ను రెండు రోజుల తర్వాత రుషికొండ నుంచి తరలించేందుకు ప్రయత్నించిన సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. పార్టీలో డ్రగ్స్ వాడిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, డ్రగ్స్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సోనీ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తండ్రి వైఖరికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు: గల్లా జయదేవ్