telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తాగునీటి కోసం చిత్రపురి కాలనీ వాసుల ఆందోళన

Drinking water problem Hyderabad

తాగు నీళ్లు రావడం లేదని హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ సింగిల్ బెడ్రూమ్ వాసులు శనివారం ఆందోళనకు దిగారు. ఉదయం కాలనీ ప్రెసిడెంట్, సినీ రచయిత పరుచూరి వేంకటేశ్వరరావు ముందు ఆందోళన చేపట్టారు. గత రెండు రోజులుగానీళ్లు రావడం లేదని.. తమకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.

రోజురోజు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని అయినప్పటికి మా సమస్యను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఒకపక్క తాము తాగునీటికి ఇక్కట్లు పడుతుంటే.. పక్కనే ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ వాసులకు నీళ్లు ఇవ్వడంపై మండిపడుతున్నారు. వారికి ఇస్తూ తమకు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే తమకు నీళ్లు అందివ్వాలని వేంకటేశ్వరరావును కోరారు.

Related posts