డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఆకాశ్-1 ఎస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణి పరీక్ష విజయవంతమైంది. రెండు రోజుల కాలంలో రెండోసారి చేపట్టిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. అత్యాధునిక స్వదేశీ పరిజ్ఞానంతో ఆకాశ్-1 ఎస్ క్షిపణిని రూపొందించారు.
ఇటీవలే భారత్ సబ్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ఒడిశా తీరం నుంచి నిర్భయ్ మిస్సైల్ను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఇది చేధిస్తుంది.