ఏపీలో విజయవాడ-విశాఖపట్టణం మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు త్వరలో పరుగులు పెట్టనుంది. ఈ రైలు వారంలో ఐదు రోజులు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ ప్రకటన చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
‘ఏపీ ప్రజలకు శుభవార్త’ అని, విశాఖపట్నం- విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్రారంభించాలని తాను రెండు నెలల క్రితం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ని అభ్యర్థించానని పేర్కొన్నారు. త్వరలోనే రైలును ప్రవేశపెడతానని తనకు లేఖ ద్వారా గోయల్ ధృవీకరించారని జీవీఎల్ పేర్కొన్నారు.