telugu navyamedia
వార్తలు సామాజిక

పాత సీరియళ్లను పునఃప్రసారం చేస్తున్న దూరదర్శన్!

Dooradarshan National

కరోనా ను అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో టీవీ చూడడం అనేది అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. ఇదే అదనుగా దూరదర్శన్ చానల్ తన పాత హిట్ సీరియళ్ల దుమ్ముదులిపి బయటికి తీస్తోంది.

రామాయణ్ సీరియల్ ను పునఃప్రసారం చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన దూరదర్శన్ యాజమాన్యం తాజాగా, మహాభారత్, సర్కస్ వంటి సూపర్ హిట్ సీరియళ్లను నేటి నుంచి మళ్లీ ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. రామ‌య‌ణం సీరియ‌ల్ తొలిసారి 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం అయ్యింది. ఈ సీరియల్ అప్పట్లో ఎంతో జనాధారణ పొందింది.

Related posts