అమెరికాలో ఇప్పటికే 10 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అత్యధిక పరీక్షలు చేసిన దేశాల జాబితాలో అమెరికా తర్వాత భారత్ ఉందని చెప్పారు. భారత్లో ఇప్పటివరకు మొత్తం 7,31,10,041 కరోనా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తమ దేశంలో ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణతో పాటు విద్యా సంస్థలను త్వరగా తిరిగి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కరోనా సోకిన వారిని గుర్తించేందుకు 15 కోట్ల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. 15 నిమిషాల్లో కరోనాను నిర్ధారించే అబోట్ ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ కేర్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వాటిలో 5 కోట్ల కిట్లను కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వైద్య సిబ్బంది వంటి వారికి వాడనున్నట్లు చెప్పారు. మిగతా కిట్లను ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి తోడుగా వాడతామని చెప్పారు. బడుల్లో ఉపాధ్యాయులకు నిరంతరం కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
మోదీ వల్ల దేశం చాలా నష్టపోతోంది: రాహుల్ గాంధీ