telugu navyamedia
రాజకీయ వార్తలు

ట్రంప్ ట్వీట్ పై ట్విట్టర్ నోటీసులు!

trump usa

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రజా ప్రయోజన నోటీసులు జారీ చేసింది. వాషింగ్టన్ లో అటానమస్ జోన్ ను స్థాపించేందుకు ప్రయత్నిస్తే సీరియస్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతామని ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం వాషింగ్టన్ లో అటానమస్ జోన్ అనేది ఉండబోదని చెప్పారు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్ పై ట్విట్టర్ అభ్యంతరం తెలిపింది.

తమ సంస్థ విధానాలను ఉల్లఘించారంటూ ప్రజా ప్రయోజనాల నోటీసును జారీ చేసింది. ట్రంప్ చేసిన ట్వీట్ ప్రజలకు హాని కలిగించే విధంగా ఉందని పేర్కొంది. ట్వీట్ పై వార్నింగ్ లేబుల్ ఉంచింది. ట్విట్టర్ తీరును వైట్ హౌస్ తప్పుపట్టింది. శాంతిభద్రతలను ఎవరూ అతిక్రమించకుండా ఉంచేందుకే ట్రంప్ అలా ట్వీట్ చేశారని తెలిపింది. అధ్యక్షుడి వ్యాఖ్యలను వినే హక్కు ప్రజలకు ఉందని, ఆ తర్వాత ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించుకుంటారని పేర్కొంది.

Related posts