కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ను భారత్ తమకు ఎగుమతి చేయకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఔషధాల ఎగుమతిపై నిషేధం విధించిన భారత్ మళ్లీ ఎగుమతి చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్రంప్ మరోసారి మాట్లాడుతూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గి భారత్పై ప్రశంసలు కురిపించారు.
‘హైడ్రాక్సీ క్లోరోక్విన్ను ఇప్పటికే దాదాపు 29 మిలియన్ల డోసులు కొన్నాను. భారత ప్రధాని మోదీతో నేను మాట్లాడాను.. భారత్ నుంచి మాకు ఆ ఔషధాలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉంది. వాటిని పంపిస్తారా? అని మోదీని అడిగాను. సానుకూలంగా స్పందించారు. ఆయన చాలా మంచి దృక్పథంతో ఉన్నారు. భారత్కు కూడా ఆ ఔషధాలు చాలా అవసరం అందుకే వాటి ఎగుమతులను ఆపేశారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మళ్లీ భారత్ ఆ నిషేధం ఎత్తి వేస్తూ పలు దేశాలకు సరఫరా చేస్తామని ప్రకటించడంతో ట్రంప్ మళ్లీ కూల్ అయి భారత్పై ప్రశంసలు కురిపించారు.