చైనాలో చోటుచేసుకున్న కరోనా మరణాల సంఖ్యపై ఆదేశం వెల్లడిస్తున్న వివరాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ అనుమానాలను లేవనెత్తారు. చైనాలో వైరస్ మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని ట్రంప్ అన్నారు.
చైనాలో చోటుచేసుకున్న మరణాలపై ఓ క్లాసిఫైడ్ రిపోర్ట్ వైట్హౌజ్కు అందింది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యను చైనా కప్పిపుచ్చినట్లు బ్లూమ్బర్గ్ కూడా తన రిపోర్ట్లో పేర్కొన్నది. అయితే ప్రస్తుతం వైట్హౌజ్ నివేదిక తనకు అందలేదని, కానీ చైనాలో సంభవించిన మరణాల సంఖ్య మాత్రం తక్కువగా ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చైనాలో ఇప్పటి వరకు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం 3312 మంది మరణించారు.