telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

2018లో భారత్ కు డాలర్ల వెల్లువ.. ఎన్నికలే కారణమా..! 5.4 లక్షల కోట్లు..

dollars transferred to India in 2018

భారత్‌కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2018లో వివిధ దేశాల నుంచి 79 బిలియన్‌ డాలర్లు(5.49 లక్షల కోట్లు) భారత్‌కు చేరినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక తెలిపింది. దీనితో డాలర్ల రూపంలో అత్యధికంగా సొమ్ము జమ అయిన దేశంగా భారత్‌ మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌ తర్వాత చైనా( 67 బిలియన్‌ డాలర్లు), మెక్సికో (36 బిలియన్‌ డాలర్లు), ఫిలిప్పీన్స్‌ 34(బిలియన్‌ డాలర్లు), ఈజిప్ట్‌(29 బిలియన్‌ డాలర్లు) దేశాలు ఉన్నాయి. ప్రపంచబ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. గత మూడేళ్లలో డాలర్ల రూపంలో భారత్‌కు వచ్చే సొమ్ము పెరుగుతూ వస్తోంది. 2016లో 62.7 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2017 నాటికి ఆ మొత్తం 65.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2018లో ఏకంగా 79 బిలియన్‌ డాలర్లకు చేరింది.

విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య 14శాతం పెరిగింది. ముఖ్యంగా కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన తమ వారిని ఆదుకునేందుకు అనేక మంది పెద్ద మొత్తంలో సొమ్మును భారత్‌కు పంపారు.. అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. మరోపక్క పొరుగుదేశం పాక్ కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య మితంగా(7శాతం) ఉంది. తక్కువ, మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాలకు 2017లో 483 బిలియన్‌ డాలర్లు వచ్చి చేరగా, 2018లో 9.6శాతం వృద్ధి రేటుతో అత్యధికంగా 529 బిలియన్‌ డాలర్లు జమ అయ్యాయి. అత్యధిక ఆదాయం కలిగిన దేశాల్లో ఇది 633 బిలియన్‌ డాలర్ల(2017) నుంచి 689 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

Related posts