టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికిరాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తనపై చంద్రబాబు, నారా లోకేశ్ చూపిన ఆదరణను ఎన్నటికీ మరువలేనని… ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన చంద్రబాబుకు దన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు.ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.