telugu navyamedia
సినిమా వార్తలు

మోడీ బయోపిక్… నిలిపివేయాలంటూ డిఎంకే లేఖ

PM-Narendra-Modi-Biopic

బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “పీఎం నరేంద్రమోదీ”. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రధాని నరేంద్ర మోడీ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే “పీఎం నరేంద్ర మోదీ : స్టోరీ ఆఫ్ ఏ బిలియన్ పీపుల్” చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో నరేంద్ర మోదీ బాల్యం, రైళ్లలో టీ అమ్మిన దృశ్యాలు, ఆర్ఎస్ఎస్ లో చేరడం, గోద్రా అల్లర్లు, మోదీని ఇందిరాగాంధీ అరెస్ట్ చేయించడం, ఆపై ఆయనపై ప్రజల్లో పెరిగిన నమ్మకం, ప్రధానిగా ఎన్నికకావడం, ప్రధానిగా విదేశీ పర్యటనలు తదితర అంశాలను చూపించారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు కమర్షియల్ గా ఉందని చెబుతున్నారు. అంతేకాదు ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇక ఏప్రిల్ 5న భారీ ఎత్తున 23 భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా… తమిళనాడుకు చెందిన పొలిటికల్ పార్టీ డిఎంకే ఈ బయోపిక్ విడుదలకు అభ్యంతరం తెలుపుతోంది. ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉందని, లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ చీఫ్ ఎలక్షన్ కమీషన్, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ కు వినతి లేఖలు పంపించారు. మరి ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో దర్శన్‌ కుమార్, బొమన్‌ ఇరానీ, మనోజ్‌ జోషీ, ప్రశాంత్ నారాయణన్‌, జరీనా వాహబ్‌, సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Related posts