తెలంగాణ ప్రజలు బీజేపీని నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిపించి సీఎం కేసీఆర్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఉద్యమం కరీంనగర్లో పుట్టిందని చెప్పే కేసీఆర్ను అక్కడి ప్రజలే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించారంటే ఇక టీఆర్ఎస్ పార్టీ పతనం అయినట్టేనని అన్నారు. అమలు చేయని పథకాలను పెట్టి అమాయకపు ప్రజలను మోసం చేసి కేసీఆర్ సీఎం అయ్యారని విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో వచ్చేది కాదని పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 50 శాతం మంది రైతులకు రైతుబంధు అందలేదని విమర్శించారు ఎన్నికల సమయంలో రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారం అయిందని.. తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందని ఆరోపించారు.
ప్రకృతిని కాపాడుకోవాలి..నల్లమలను రక్షించుకోవాలి: నాగబాబు