telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ పోలీసులను చూసి ప్రతి రాష్ట్రం నేర్చుకోవాలి: రాజాసింగ్

BJP-MLA Raja-Singh

వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ తెలంగాణ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తెలంగాణ పోలీసులను చూసి ప్రతి రాష్ట్రం నేర్చుకోవాలని అన్నారు. భారత్ లో వేల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి రాష్ట్రంలోని పోలీసులు ఈ విధంగా చర్యలు తీసుకుంటే మహిళలపై దౌర్జన్యాలు ఆగిపోతాయని ఆయన తెలిపారు.

పోలీసులు చేసిన ఈ ఎన్ కౌంటర్ పై విచారణ జరపాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారని ఆయన తెలిపారు. ఏ విచారణా అవసరం లేదని, పోలీసులు భయపడాల్సిన అవసరం లేదని, దేశ మంతా వారి వెంటే ఉందని వ్యాఖ్యానించారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినందుకు పోలీసులకు హ్యాట్సాఫ్ తెలుపుతున్నానని చెప్పారు.

Related posts