telugu navyamedia
రాజకీయ వార్తలు

నిందితులను కఠినంగా శిక్షించాలి.. ‘దిశ’ అత్యాచార ఘటనపై రాజ్యసభలో చర్చ

Rajyasabha Short circuit smoke

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘దిశ’ అత్యాచార ఘటనపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. కేవలం చట్టాలు చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై దాడులను తొలగించడాని సమాజం నిలబడాలని వ్యాఖ్యానించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.

దిశ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా సామాజిక సంస్కరణ జరగాలని, న్యాయ వ్యవస్థతను కోరుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అమీ యజ్ఞిక్ అన్నారు.

Related posts