telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

దిశ హత్య ఘటన పై .. సీన్‌ మొత్తం రీకన్‌స్ట్రక్షన్‌

dishsa murder case

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య ఘటన పై నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేసేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దిశ కేసులో నలుగురు నిందితులను డాక్టర్ల చేత పోలీసులు పరీక్షలు చేయించనున్నారు. పోలీసులు ఇప్పటికే సీన్‌ రీకనస్ట్రక్షన్‌ చేసినట్టు కూడా తెలుస్తోంది. నిందితులను విచారించే బృందానికి శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి అధ్యక్షతన నలుగురు అడిషినల్‌ ఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సై బృందం ఏర్పాటైంది.

దిశ ఇంటి నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి ఆమెను పెట్రోల్‌ పోసి కాల్చిన సమయం వరకు ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే దానిపై ఈ బృందం దర్యాప్తు చేయనుంది. ఈ విధంగా మొత్తం సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. వారం రోజుల కస్డడీలో నిందితుల దగ్గరి నుండి పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు. నిందితులను అత్యాచారం, హత్య జరిగిన స్థలానికి తీసుకెల్లి పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు.

Related posts