telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో మరో దిశ ఘటన : తెలంగాణకు చెందిన బాలికపై దారుణం

దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కొంత మంది దుర్మార్గులు దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు. తాజాగా  ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లాలో మరో దిశ ఘటన రిపీట్ అయింది. కొందరు గుర్తు తెలియని దుండగులు 16 ఏళ్ళ బాలికను అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా.. ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంట్టించారు దుండగులు. అసలు వివరాల్లోకి వెళితే.. గాలేరు-నగరి కాలువ సిమెంట్ కాంక్రీట్ పనులకు తల్లి దండ్రులతో బాలిక వచ్చింది. అక్కడున్న కొందరు కామాంధులు ఆ బాలికపై కన్నేశారు. అమ్మాయికి మాయమాటలు చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన బనగాపల్లె మండలం యాగంటిపల్లిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మృతురాలు తెలంగాణలోని నారాయణపేట జిల్లా మర్రికెల్ల మండలానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. ఇక ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts