దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఘాటుగా స్పందించారు. అగ్రకులాల మహిళలకు ఓ న్యాయం, పేద దళితులకు మరో న్యాయమా? అంటూ మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ కళ్లుగప్పి చేసిన దారుణ హత్యలే ఈ ఎన్ కౌంటర్ అని ఆరోపించారు.
దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం తర్వాత వాస్తవం వెల్లడవుతుందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్ ను స్వాగతిస్తున్నామని మంద కృష్ణ తెలిపారు.