telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఎన్‌కౌంటర్ స్థలంలో ఫోటోలు తీసిన విదేశీ మీడియా

disa accused Funeral will be tomorrow

దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఎన్‌హెచ్ఆర్సీ తెలంగాణ పోలీసుల నుంచి పూర్తి వివరాలు కోరింది. దీంతో స్పందించిన శంషాబాద్ పోలీసులు దిశపై హత్యాచారం జరిగినప్పటి నుంచి ఎన్‌కౌంటర్ జరిగే వరకు అసలేం జరిగిందన్న దానిపై ఎన్‌హెచ్ఆర్సీ బృందానికి పూర్తి వివరాలు అందజేశారు.

మరోవైపు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని నిన్న విదేశీ మీడియా ప్రతినిధులు సందర్శించారు. అమెరికాలోని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు చెందిన సౌత్ ఏషియా ప్రతినిధి జెఫ్రే గెటిల్‌మేన్ ఆధ్వర్యంలో ముగ్గురు మీడియా ప్రతినిధులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన దిశ దహనం, హంతకుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఈ బృందం వీడియోలు, ఫొటోలను తమ కెమరాల్లో చిత్రీకరించింది.

Related posts