దిశ హత్యాచార కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య మైనర్ అని తాజా విచారణలో తేలింది. నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు నిన్న నిందితుడి గ్రామంలో జరిపిన ప్రాథమిక విచారణలో ఈ విషయం వెల్లడైంది. ఆమె చదువుకున్న పాఠశాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా బాధితురాలి వయసు 13 సంవత్సరాల ఆరు నెలలని తెలిసింది.
చెన్నకేశవులు తల్లిదండ్రులతో మాట్లాడిన అధికారులు ఆమె మైనర్ కావడంతో బాలల సదనంలో ఆమెకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. అయితే, ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి అని, సదనానికి పంపబోమని అధికారులకు తేల్చి చెప్పారు. తాము తయారుచేసిన ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్టు అధికారులు తెలిపారు. బాధిత బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ ఇంట్లో ఉంటోంది.
ఫలితాల రోజే కూటమి సమావేశం: చంద్రబాబు