ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం “రాజుగారిగది” చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా “రాజుగారి గది-2” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీలకపాత్రల్లో నటించారు. అయితే “రాజుగారిగది” ఆకట్టుకున్నంతగా “రాజుగారి గది-2” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం “రాజుగారిగది 3”. అశ్విన్బాబు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సినిమా నిర్మితమైంది. షబీర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్కు ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ముందుగా ఈ సినిమాలో తమన్నాని కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. సినిమా లాంచింగ్ కార్యక్రమంలోను పాల్గొన్న ఈ అమ్మడు ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకోవడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకనిర్మాత ఓంకార్ వెల్లడించారు. “ఈ సినిమాలో ముందుగా తమన్నాను తీసుకున్న మాట వాస్తవం. ముందుగా ఆమెకు సినిమా లైన్ మాత్రమే చెప్పాం. ఆమెకు నచ్చింది. సినిమా ప్రారంభమవడానికి కొద్దిరోజుల ముందు ఫుల్ నెరేషన్ ఇచ్చాం. దానికి ఆమె చాలా మార్పులు చెప్పారు. తన పాత్రను మార్చమని, దానికి సరిపడే విధంగా కథ కూడా మార్చమని అడిగారు. అయితే సినిమా ప్రారంభమవడానికి కొద్ది రోజులే ఉండడంతో కథలో మార్పులు చేయడానికి మాకు సమయం లేదు. దాంతో తమన్నా వద్దనుకున్నాం. తాప్సీ, కాజల్ వంటి హీరోయిన్ల కోసం ప్రయత్నించాం. కానీ, వారి డేట్లు ఖాళీగా లేవు. దాంతో అవికా గౌర్ను తీసుకున్నాము” అని ఓంకార్ చెప్పారు.
previous post
మళ్లీ అవే ఏడుపులు… చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్