telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కొక్కడికి… డైరెక్టర్ మారుతీ ఫైర్

Maruthi

దర్శకుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో “ప్ర‌తిరోజు పండ‌గే” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌లో తేజూ క‌నిపించ‌నున్నాడు. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గానే ఉంటాడు ఈ దర్శకుడు. ఈ సందర్భంగానే తాజాగా ఈయన చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. గోశాలలో ఆయన గొడుగు పట్టుకుని హాయిగా నవ్వుతూ నడుస్తున్న ఫోటోకు ప్రతిరోజూ పండగే అని ట్యాగ్ పెట్టాడు మారుతి. ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరుతో తన సినిమాకు ప్రమోషన్ చేసుకుంటున్నావుగా బ్రదర్ అంటూ ఓ నెటిజన్ మారుతి పెట్టిన పోస్టు కింద కామెంట్ పెట్టాడు. దాంతో ఈయనకు చిర్రెత్తుకొచ్చింది. “ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కొక్కడికి.. నచ్చిన పోస్ట్ పెడితే కూడా పిచ్చి నాటకాలు చేస్తున్నారు” అంటూ ఫైర్ అయిపోయాడు.

Related posts