దర్శకుడు మారుతి దర్శకత్వంలో “ప్రతిరోజు పండగే” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సరికొత్త లుక్లో తేజూ కనిపించనున్నాడు. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటాడు ఈ దర్శకుడు. ఈ సందర్భంగానే తాజాగా ఈయన చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. గోశాలలో ఆయన గొడుగు పట్టుకుని హాయిగా నవ్వుతూ నడుస్తున్న ఫోటోకు ప్రతిరోజూ పండగే అని ట్యాగ్ పెట్టాడు మారుతి. ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరుతో తన సినిమాకు ప్రమోషన్ చేసుకుంటున్నావుగా బ్రదర్ అంటూ ఓ నెటిజన్ మారుతి పెట్టిన పోస్టు కింద కామెంట్ పెట్టాడు. దాంతో ఈయనకు చిర్రెత్తుకొచ్చింది. “ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కొక్కడికి.. నచ్చిన పోస్ట్ పెడితే కూడా పిచ్చి నాటకాలు చేస్తున్నారు” అంటూ ఫైర్ అయిపోయాడు.
Some one did superb poster.. liked it soo much #PratiRojuPandaage pic.twitter.com/7jVlErz19I
— Maruthi director (@DirectorMaruthi) 29 October 2019
ముందు తెలుగు టైపు చక్కగా చై… వాడుకునవా కాదు వాడుకున్నావా.. వీలు పుటిందే కాదు.. వీళ్ళు పుట్టిందే… ఏదైనా నచ్చిన పోస్ట్ పెడితే ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కోడికి..
— Maruthi director (@DirectorMaruthi) 29 October 2019