జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో పవన్ కళ్యాణ్ తప్పకుండా సినిమా ఫీల్డ్లోకి రీ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సినిమాలకి దూరమైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పలువురు నిర్మాతలు ఆయనతో మళ్ళీ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో పవన్ తాజా చిత్రం ఉంటుందని తెలుస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్లో విజయవంతమైన `పింక్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారని అంటున్నారు. అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం పింక్. ఈ మూవీ తమిళంలో నెర్కొండ పార్వాయి అనే టైటిల్తో రూపొందింది. అజిత్ ప్రధాన పాత్రలలో నిర్మితమైన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. ఇప్పుడు తెలుగులోను పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ చిత్రం రూపొందనుందట. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రని తెలుగులో పవన్ చేయనున్నట్టు టాక్. దీనిపై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది.
previous post
సెట్లో చిరాగ్గా… అయినా తప్పదు : జాన్వీ కపూర్