తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పటి వరకు వెండితెర, బుల్లితెరకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు ట్రెండ్కు తగినట్లు త్వరలోనే డిజిటల్ మాధ్యమంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని కోలీవుడ్ కోడై కూస్తోంది. మణిరత్నం నిర్మించనున్న ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘నవరస’ అని, ఇందులో మొత్తం 9 ఎపిసోడ్లు ఉంటాయని, మొత్తం ఎపిసోడ్ లో కేవలం ఒక ఎపిసోడ్ లో మాత్రమే సూర్య కనబడతారని వార్తలు విన్పిస్తున్నాయి. దానికి జయేంద్ర దర్శకత్వం వహించనున్నారనీ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. మణిరత్నం సంస్థ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ఆంథాలజీలో ఓ కథకు జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న మాట వాస్తవమే. అయితే, ఆయన దర్శకత్వంలో సూర్య నటిస్తున్నాడనేది నిజం కాదు. జయేంద్ర ”ప్రస్తుతం ఏదీ స్పష్టంగా చెప్పలేను. వారం, పది రోజుల్లో వివరాలు వెల్లడించగలను” అని అన్నారాయన.