telugu navyamedia
సినిమా వార్తలు

చూసేవారికి రోత పుట్టిస్తోంది సార్ : హరీష్ శంకర్

Harish-Shankar

హైదరాబాద్ లో కొన్నిచోట్ల రోడ్లపైనే మురుగునీరు పొంగిపొర్లుతోంది. సాధారణంగా చాలామంది ఈ విషయాన్నీ పెద్దగా పట్టించుకోరు. అదే దారిలో చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్. మాదాపూర్‌లోని హైటెక్స్ సమీపంలో ఉన్న జూబ్లీ ఎన్‌క్లేవ్ దగ్గర మురుగు నీరు ప్రవహిస్తున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పరిస్థితిని వివరిస్తూ దయచేసి పట్టించుకోండంటూ విజ్ఞప్తి చేశారు. చిన్నారులు నడిచే దారని.. వాళ్లకు ఇదేంటో తెలియదని వ్యాఖ్యానించారు. చూసేవారికి రోత పుట్టిస్తోంది సార్ అంటూ ట్వీట్ చేశారు. ఏ యంగ్ డైరెక్టర్ కేవలం సినిమాల గురించే కాకుండా ఇలాంటి సామాజిక విషయాలను కూడా పట్టించుకోవడం అభినందించదగ్గ విషయం.

Related posts