పవన్కల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ ఏడాది ఈయన తెరకెక్కించిన `గద్దలకొండ గణేష్` మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్, అథర్వ మురళి ప్రధాన పాత్రలలో హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్. ప్రస్తుతం గద్దలకొండ గణేష్ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండకి రీమేక్ గా రూపొందింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అథర్వకి జంటగా మృణాలినీ రవి నటించింది. కెరీర్లో తొలిసారి పవర్ ఫుల్ రోల్ చేసిన వరుణ్ తేజకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రీసెంట్గా నిర్మాతగా కెరీర్ను స్టార్ట్ చేసిన మహేశ్ కొనేరుతో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. త్వరలోనే మహేష్ కొనేరు నిర్మాణ సంస్థ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తాను సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.