మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ హిందూ తీవ్రవాది అని సినీ డైరెక్టర్ గౌతమన్ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో వ్యవసాయాన్ని నిర్మూలించేందుకు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, హైడ్రోకార్బన్ పథకం ఇందుకు నిదర్శనమని, రైతుల పంటపొలాలను ప్రైవేటు సంస్థలకు దారాదత్తంచేసి సొమ్ముచేసుకోవడంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందని, అందరి ఆకలి తీర్చే అన్నదాత పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నారు. అంతేకాదు డెల్టా జిల్లాల్లో పైప్లైన్ ఏర్పాటు పనులను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్నారని, ఈ సమస్యను మళ్లిం చేందుకే నటుడు, మక్కల్ నీదిమయ్య అధ్యక్షుడు కమల్హాసన్ హిందూ తీవ్రవాదం గురించి వ్యాఖ్యానించారంటూ గౌతమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన వ్యాఖ్యలపై కమల్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
previous post