telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఎస్బిఐ ఖాతాదారులకు అలెర్ట్… బ్యాంకుకు కొత్త చైర్మన్

Dinesh-kumar-khara

కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్‌కు కొత్త చైర్మన్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాంక్‌లోనే మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న దినేశ్ కుమార్ ఖారాను ఎస్‌బీఐ చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు ఎస్‌బీఐ చైర్మన్‌గా ఉన్న రజనీశ్ కుమార్ స్థానంలో ఖారా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 7తో రజనీశ్ కుమార్ పదవీ కాలం ముగిసింది. మూడేళ్ల పదవీ కాలంతో దినేశ్ కుమార్ ఖారాను ఎస్‌బీఐ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా దినేశ్ కుమార్ ఖారా 2016 ఆగస్ట్‌లో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మూడేళ్లకు ఈయన పదవీ కాలం ముగియాల్సి ఉంది. అయితే మంచి పనితీరు కారణంగా పదవీ కాలం పొడిగింపు లభించింది. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ స్టేట్ బ్యాంక్‌లో వీలీనం అయ్యే ప్రక్రియలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఖాతా 1984లో ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా చేరారు. ఈయనకు బ్యాంకులో 33 ఏళ్ల అనుభవం ఉంది. ఈయన ఢిల్లీ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకింగ్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖాతా నియామకం చోటు చేసుకోవడం గమనార్హం.

Related posts