బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా తల్లి బెట్టీ కపాడియా మరణించారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో ఆమె ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమెని కొద్ది రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఆమె కన్నుమూశారు. కాగా ఇటీవలే బెట్టీ కపాడియా తన 80 పుట్టినరోజును చేసుకున్నారు., ఈ రోజు ఉదయం డింపుల్ కుటుంబ సభ్యులు బెట్టీకి అంత్యక్రియలు నిర్వహించారు. సన్నీ డియోల్, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా తదితరులు ఆమెని కడసారి చూసేందుకు డింపుల్ ఇంటికి చేరకున్నారు. డింపుల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నాగబాబు వల్లే గెలిచామా ? మీరెవరు చెప్పడానికి ? : జీవితరాజశేఖర్