మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లెఓవర్ పైనుంచి బస్సు అదుపుతప్పి రైసేన్ నదిలో పడటంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఓ మహిళ, రేండేళ్ల బాలుడు ఉన్నారు.
ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బస్సు రైసేన్ నుంచి ఛత్తార్పూర్కు వెళ్తుండగా ప్రమాదం భారిన పడింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.