telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మికపై టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆగ్రహం ?

Rashmika

“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.  వెండి తెరపై ఈ జంటకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రం చేశారు. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది. తెలుగులో మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ తో ‘భీష్మ’ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. తాజాగా రష్మిక గురించి ఆంగ్ల మీడియాలో ఆసక్తికర కథనం ప్రచురితమైంది. రష్మికపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు చాలా ఆగ్రహంగా ఉన్నారనేది ఆ కథనం సారాంశం. నాగ చైతన్య హీరోగా కొత్త దర్శకుడు శశి డైరెక్షన్‌లో తాను నిర్మించబోయే సినిమాలో రష్మికను హీరోయిన్‌గా తీసుకోవాలని దిల్ రాజు భావించారట. ఈమేరకు ఆమెను సంప్రదించారట. అయితే రష్మిక చెప్పిన రెమ్యునరేషన్ విని ఆయన షాకయ్యారట. అలాగే దర్శకుడు ఇప్పటికే రెండుసార్లు కథ చెప్పినా.. మరోసారి చెప్పాలని అడుగుతోందట. రష్మిక ప్రవర్తనతో విసిగిపోయిన దిల్ రాజు.. తమ సినిమాలో వేరే హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న `జెర్సీ` హిందీ రీమేక్‌ను కూడా రెమ్యునరేషన్ కారణంగానే రష్మిక తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి.

Related posts