telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోని కుటుంబంలో కరోనా కలకలం….

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ సింగ్ ధోనీ తల్లిదండ్రులు దేవకి దేవీ, పాన్ సింగ్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా ఇద్దరికి పాజిటీవ్ అని తేలింది. దాంతో వారిని వెంటనే రాంచీలోనీ పల్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బిజీగా ఉన్న ధోనీ.. ముంబై‌లో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ రోజు వాంఖడే మైదానం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తెల్చుకోనుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు రెండింటిలో విజయం సాధించింది. ఐపీఎల్ 2020 సీజన్ అనంతరం ఆటకు దూరమైన మహీ.. పూర్తిగా కుటుంబంతో గడిపాడు. ట్రైనింగ్ క్యాంప్‌లో భాగంగా మార్చిలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిసాడు.

Related posts