telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ధోని .. మిగిలిన రెండు వన్డేల నుండి అవుట్.. !

Ms Dhoni inured net pratice

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మూడు పూర్తి అయ్యాయి. భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో ధోని కి విశ్రాంతినిచ్చారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచులు జరగ్గా అందులో మొదటి రెండింటిలో విజయం సాధించింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో కోహ్లి సేన ఓడింది.

నాలుగో వన్డే పంజాబ్‌లోని మొహాలీలో ఆదివారం నాడు జరగనుంది. మార్చి 13న ఢిల్లీలో ఐదో వన్డే జరగనుంది. చివరి రెండు వన్డేల నుంచి ధోనికి విశ్రాంతినిచ్చారు. సంజయ్ బంగర్‌ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ..చివరి రెండు వన్డేల్లో పలు మార్పులు చేయనున్నాం. ఈ రెండు మ్యాచుల్లో ధోని ఆడడు. ఆయనకు విశ్రాంతి ఇస్తున్నాం అని తెలిపారు. ధోని స్థానంలో రిషబ్‌ పంత్‌ కాని భువనేశ్వర్‌ కాని ఆడే అవకాశాలున్నాయి. ఆటకు ముందు టిమిండియా కోచ్‌, కెప్టెన్‌ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారని బంగర్‌ వెల్లడించారు.

Related posts