telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ధోనీపై అభిమానం … అన్నీ ఫ్రీ అంటున్న.. హోటల్ యజమాని..

dhoni fan offering free food

అభిమానం ఒక వ్యక్తిచేత ఎంత పనైనా చూపిస్తుంది. ఇక ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అలాంటి ఒక వీరాభిమాని.. ధోనీపై తనకు ఎంతటి అభిమానముందో మరో అభిమాని నిరూపించాడు. పశ్చిమబెంగాల్ అలిపుర్దువార్ జిల్లాకు చెందిన శంభూ బోస్ అనే వ్యక్తి ధోనీకి వీరాభిమాని. అందుకే తన హోటల్ కు ఎంఎస్ ధోనీ పేరు పెట్టుకున్నాడు. ధోనీ అభిమానులు ఎవరైనా అక్కడ భోజనం చేసినా, టీ లేదా కాఫీ తాగినా వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు.

బోస్ తనకు ధోనీ వ్యక్తిత్వం, ఆటతీరు ఎంతో ఇష్టమని తెలిపాడు. ధోనీ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఒకవేళ ధోనీని కలిసే అవకాశం తనకు వస్తే… తన హోటల్ కు రమ్మని ధోనీని ఆహ్వానిస్తానని తెలిపాడు. ధోనీకి అన్నం, చేపల కూర అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఏదో ఒక రోజు ధోనీని కలుస్తాననే నమ్మకం తనకుందని… అప్పుడు తన హోటల్ కు ఆహ్వానించి చేపల కూర రుచి చూపిస్తానని అన్నాడు.

Related posts