మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మద్దతు దారులు ప్రభంజనం సృష్టించారని… ఎన్నికలకు భయపడుతున్నారంటూ మమ్మల్ని విమర్శించిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ గెలుస్తుందని… తాను గతంలో చెప్పినట్లే 90 శాతానికి పైగా తమకు ఫలితాలొచ్చాయన్నారు. రేపు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృత్తం అవుతాయని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు ఉత్తరకుమార ప్రగల్భాలు మానుకోవాలని.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. జగన్ బ్రాండ్ పంచాయతీ ఎన్నికల్లో పనిచేసిందని పేర్కొన్నారు. అలాగే షర్మిల పార్టీ ఏర్పాటుపై ఆయన స్పందించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని.. టీఆర్ఎస్ లో కదలిక వచ్చిందన్నారు. అటు బీజేపీ బలపడుతోందని… ప్రస్తుతం తెలంగాణలో సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ అభిమానులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ ప్రవేశాన్ని మేం తప్పుపట్టడం లేదని… ఇది జగన్ కు అనుకూలం కాదు…వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. అలాగే పంచాయతీ ఎన్నికలపై ఆయన స్పందించారు.
previous post
కొత్త వ్యవసాయ చట్టాల పై హర్యానా సీఎం కీలక వ్యాఖ్యలు…