telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఫలించని ప్రయత్నాలు.. దొరకని బోటు ఆచూకీ

team found difficult to bring boat

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. బోటును బయటికి తీసేందుకు నేటికి మూడు రోజులుగా ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. తొలిరోజు లంగరుకు బరువైన వస్తువు తగలడం, ఐరన్ రోప్ సైతం తెగిపోవడంతో అది కచ్చితంగా బోటు అయ్యుంటుందని భావించారు. దాంతో రెండో రోజు బోటు బయటికి తీయడం సాధ్యపడుతుందని అందరూ అనుకున్నారు.

రెండోరోజు, మూడో రోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా లంగరుకు ఎలాంటి వస్తువు తగలకపోవడంతో అందరిలోనూ నిరాశ నెలకొంది. ఒక్కసారి లంగరుకు వస్తువు తగిలితే దానిచుట్టూ రోప్ తో రౌండప్ చేసి పైకి లాగాలన్నది ధర్మాడి సత్యం బృందం ప్రయత్నించింది. కానీ, ఓసారి తగిలినట్టే తగిలి రోప్ తెగిపోవడంతో ప్రయత్నం విఫలమైంది.

Related posts