ప్రముఖ తమిళ హీరో ధనుష్ కూడా “ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్” అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. రొమైన్ ప్యూర్తొలా రాసిన “ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్రోబ్” పుస్తకం ఆధారంగా కెనడియన్ స్క్రిప్ట్ రైటర్ కమ్ డైరెక్టయర్ కెన్ స్కాట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్లు ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడారియోలతో ధనుష్తో జతకట్టారు. ఎమోషనల్ అండ్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఇండియాలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని పక్కిరి అనే టైటిల్తో విడుదల చేయనున్నారు. “ది ఫకీర్” చిత్రం కర్ణాటక వ్యాప్తంగా ఈనెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన విషయం తెలిసిందే. హాలీవుడ్ లో ధనుష్ నటించిన ఈ చిత్రం ఇటీవలే బార్సిలోనా సెయింట్ – జోర్డి ఫిలిమ్ ఫెస్టివల్లో అత్యుత్తమ కామెడీ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఇండియాలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోల్డెన్ రేషియో ఫిలిమ్స్ సీఈఓ అభియానందసింగ్ తరపున బెంగళూరులో మంగళవారం 160 దేశాలలో సినిమా విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా… సినిమా రెండ్రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ధనుష్ అభిమానులు.
previous post