తమిళ స్టార్ హీరో ధనుష్ నటుడిగా, నిర్మాతగా, సింగర్గా ఇలా పలు రంగాలలో తన ప్రతిభను కనబరుస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. రజినీకాంత్ అల్లుడిగానే కాకుండా తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టుపడేసే ఈ యంగ్ హీరో ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ లండన్లో జరుగుతుంది. ధనుష్ చిత్ర షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్నఅభిమానులు ఆయనని చూసేందుకు లొకేషన్కి వచ్చారు. వారిని చూసి తెగ సంతోషించిన ధనుష్ అందరితో కరచాలనం చేశారు. కొందరితో సెల్ఫీలు దిగారు. లండన్ అభిమానులు చూపించిన ప్రేమకి ధనుష్ ముగ్దుడయ్యాడు. ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, జేమ్స్ కాస్మో ప్రధాన పాత్రలలో రూపొందుతున్న గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి ఎంజీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఉలగం సుత్రుం వలిబన్” అనే టైటిల్ని వాడాలని అనుకుంటున్నారట. ధనుష్ త్వరలో “అసురన్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Fans love from #London #D40@dhanushkraja sir ❤🙏🙏🙏@DirectorS_Shiva @vinod_offl @RIAZtheboss pic.twitter.com/tnauo1M3SJ
— B.RAJA (@B_RAJA_) 18 September 2019