ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై .ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత నమ్మకమైన ఐ ఏ ఎస్ అధికారి కె ధనుంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధాన భూమిక నిర్వహించబోతున్నారు . మొన్నటివరకు శ్రీకాకుళం కలెక్టర్ గా భాద్యతలు నిర్వహించిన ధనుంజయ్ రెడ్డి వై ఎస్ కుటుంబానికి ఆప్తులు .
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పటి నుంచి ధనుజయ్ రెడ్డి ఆ కుటుంబంలో ఓ సభ్యుడుగా ఉండేవారు . అందువల్లనే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రు అవుతారని తెలియగానే ధనుజయ్ రెడ్డిని పిలిపించుకున్నారు . 23న ఫలితాలు వచ్చిన రోజు జగన్ కు ఐ ఏ ఎస్ , ఐ పి ఎస్ అధికారులను దగ్గరుండి పరిచయం చేసింది ధనుజయ్ రెడ్డే . ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనుజయ్ రెడ్డి ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశం వుంది