telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

థర్మల్ స్క్రీనింగ్ తరువాతనే రాష్ట్రంలోకి అనుమతి: డీజీపీ గౌతమ్ సవాంగ్

ఏపీకి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రానికి వచ్చే వారు స్పందన పోర్టల్ ద్వారా అనుమతి తీసుకుని పాస్ పొందిన తరువాతనే రావాలని సూచించారు. పాస్ లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ అనుమతించమని తెలిపారు. రాత్రి పూట అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందన్నారు.

Related posts