రేపటి జనతా కర్ఫ్యూని ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం ద్వారా మద్దతు తెలపాలని అన్నారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం నాడు పోలీసులందరూ స్టేషన్లలో అందుబాటులో ఉండాలని సూచించారు.
అత్యవసర సేవలు అందించేందుకు పోలీసులు సంసిద్ధులై ఉండాలని డీజీపీ స్పష్టం చేశారు. జనతా కర్ఫ్యూ పరిస్థితులను పోలీస్ కంట్రోల్ రూమ్ ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. డయల్ 100 ద్వారా సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
షర్మిలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు…