telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో పోటెత్తిన భక్తులు.. నిండిన కంపార్ట్‌మెంట్లు

tirumala temple

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చలి వణికిస్తున్నా, స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గడం లేదు. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం కిలోమీటరు మేర భక్తులు క్యూలైన్ లో బారులు తీరారు. సాధారణ సర్వదర్శనం నిమిత్తం ఈ ఉదయం క్యూలైన్లలోకి వెళ్లే వారికి రేపు దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 85,621 మంది భక్తులు దర్శించుకున్నారు. వారాంతం సందర్భంగా మొదలైన రద్దీ, సోమవారం కూడా కొనసాగుతుందని భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నామని, క్యూలైన్లలో వేచివున్న వారికి అన్న పానీయాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Related posts