కరోనా సెకండ్ వేవ్ లో ఏపీలో కేసులు భారీగా నమోదు కావడంతో అక్కడ కర్ఫ్యూ విధించారు. అయితే ఈ వైరస్ కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పేయుగుతుంది. నిన్న శ్రీవారిని 13085 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 5182 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… నిన్న శ్రీవారి హుండి ఆదాయం 82 లక్షలు. అయితే రేపటి నుంచి రెండు నెలలు పాటు అలిపిరి నడకమార్గం మూసివేశారు టీటీడీ అధికారులు జూన్ 1 నుంచి జూలై 31వరకు మరమత్తు పనులు కారణంగా ఈ మార్గం ముసేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడకమార్గాని వినియోగించు కోవాలని సూచించింది టీటీడీ. చూడాలి మరి ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందా.. లేదా అనేది.
previous post